* దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
* పీజీ, నెట్/ స్లెట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు
ఈనాడు ప్రతిభ డెస్క్: తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు- శాశ్వత ప్రాతిపదికన తితిదే డిగ్రీ కళాశాలలు/ ఓరియంటల్ కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్, తితిదే జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమమైంది. ఈ ప్రకటన ద్వారా 49 డిగ్రీ లెక్చరర్ పోస్టులు, 29 జూనియర్ లెక్చరర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెంది, విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు మార్చి 5 నుంచి మార్చి 25; డిగ్రీ లెక్చరర్ పోస్టులకు మార్చి 7 నుంచి మార్చి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు డిగ్రీ లెక్చరర్కు రూ.61,960- రూ.1,51,370. జూనియర్ లెక్చరర్కు రూ.57,100- రూ.1,47,760 వేతనం ఉంటుంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.