* జూన్లో యూజీసీ-నెట్ పరీక్ష
దిల్లీ: పీహెచ్డీ చేయాలనుకునే విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీపి కబురు చెప్పింది. నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీతో ఇకపై నేరుగా జాతీయ అర్హత పరీక్ష (నెట్)కు హాజరుకావచ్చని ప్రకటించింది. జూనియర్ రీసర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) ఉన్నా లేకపోయినా..తమ డిగ్రీతో సంబంధం లేని ఏ సబ్జెక్టులోనైనా పీహెచ్డీని అభ్యసించవచ్చని తెలిపింది. అయితే దీనికోసం తమ నాలుగేళ్ల డిగ్రీలో విద్యార్థులు కనీసం 75 శాతం ఉత్తీర్ణత సాధించాలని పేర్కొంది. ఈ ఏడాది జూన్లో నిర్వహించే యూజీసీ-నెట్ పరీక్ష నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ ఆదివారం వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు 5 శాతం సడలింపు ఉండే అవకాశం ఉందన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ ఎన్ఐఎన్ కోర్సులతో మెరుగైన అవకాశాలు
‣ కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.