• facebook
  • whatsapp
  • telegram

UPSC Recruitment: 2,253 కేంద్ర కొలువులకు ప్రకటనలు


మార్చి 27 దరఖాస్తుకు గడువు

* రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక

ఈనాడు ప్రతిభ డెస్క్‌:  కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ (ESIC)లో శాశ్వత ప్రాతిపదికన 1,930 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు; ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌ (EPFO)లో 323 పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత; పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీ (ఇంగ్లిష్ లేదా హిందీ) నైపుణ్యం కలిగి ఉండాలి. అర్హులైన అభ్యర్థులు మార్చి 27వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు (Application) చేసుకోవచ్చు. రాత పరీక్ష (Test) ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఈఎస్‌ఐ సంస్థల్లో 1,930 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు 


ఈపీఎఫ్‌వోలో 323 పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.