దిల్లీ: విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్లను సమర్థిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. మునుపటి తీర్పుపై సమీక్ష జరపడానికి ఎలాంటి ప్రాతిపదిక కనిపించడంలేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ దావాలను ‘ఓపెన్ కోర్టు’లో విచారణకు లిస్ట్ చేయాలన్న వినతిని కూడా న్యాయమూర్తులు తిరస్కరించారు. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు ప్రభుత్వం 2019లో రిజర్వేషన్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విభాగాల్లోని పేదలను ఈ కోటా నుంచి మినహాయించారు. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై 2022 నవంబరు 7న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. ఈడబ్ల్యూఎస్కు కోటాను సమర్థించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.