* మే 30 వరకు గడువు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)లో విద్యార్థులు మే 20 నుంచి వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి సూచించారు. మే 30 వరకు గడువు ఉంటుందన్నారు. గతంలో మే 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని ప్రకటించామని... విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాల వినతి మేరకు దాన్ని సవరించామన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
మరింత సమాచారం కోసం:
దోస్త్ వెబ్సైట్: https://dost.cgg.gov.in/