ఈనాడు, వరంగల్: వరంగల్ ఎన్ఐటీ విద్యార్థులు ఉద్యోగాల సాధనలో సత్తా చాటారు. 2022 - 23 సంవత్సరం ప్రాంగణ నియామకాల ప్రక్రియ ముగియగా గతంలో ఎన్నడూ లేనంతగా అత్యధికంగా కొలువులు దక్కించుకున్నారు. మొత్తం 1,326 మంది ఉద్యోగాలు సాధించారు. ఈసారి నియామకాలకు 253 కంపెనీలు వరుస కట్టగా అందులో 40 శాతానికిపైగా కొత్తవే ఉన్నాయి. దిల్లీకి చెందిన కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విద్యార్థి ఆదిత్య సింగ్ అత్యధికంగా రూ.88 లక్షల వార్షిక వేతనంతో ఎంపికయ్యారు. ఒక్కో విద్యార్థికి సగటున రూ.17.29 లక్షల వార్షిక ప్యాకేజీ దక్కింది. 30 మంది విద్యార్థులు రూ.50 లక్షలకుపైగా వార్షిక వేతనాన్ని పొందనున్నారు. 55 మందికి రూ.40 లక్షలకుపైగా, 190 మందికి రూ.30 లక్షలకుపైగా అందుకోనున్నారు. 408 మంది విద్యార్థులకు రూ.20 లక్షలకుపైగా లభించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో 50 మందికిపైగా ఎంపికయ్యారు. 2021 - 22 విద్యా సంవత్సరంలో 1132 మంది విద్యార్థులు ప్రాంగణ నియామకాలకు ఎంపికయ్యారు. సంస్థలో విద్యా ప్రమాణాలు, పరిశోధనల నాణ్యత పెరగడం వల్లే ఈసారి అత్యధిక మందికి కొలువులు దక్కాయని నిట్ సంచాలకుడు ఆచార్య ఎన్.వి.రమణారావు తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ చెత్తను వదిలించే చక్కటి ఉద్యోగం!
‣ గ్రూప్-2కి సమగ్ర సన్నద్ధత ఎలా?
‣ రివిజన్..ప్రాక్టీస్.. సక్సెస్ సూత్రాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.