• facebook
  • whatsapp
  • telegram

AP 9th Syllabus: పూర్తిగా మారనున్న 9వ తరగతి సిలబస్‌

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని పాఠశాల స్థాయి విద్యార్థుల్లో కొన్ని తరగతుల వారికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్‌ మారనుంది. ఏలూరు వచ్చిన ఏపీ ప్రభుత్వ పాఠ్యపుస్తకాల సంచాలకుడు కె.రవీంద్రనాథ్‌రెడ్డి ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ ఈ మేరకు వెల్లడించారు. ‘9వ తరగతి సిలబస్‌ పూర్తిగా మారనుంది. తెలుగు, హిందీ, ఆంగ్ల పాఠ్యపుస్తకాలతో పాటు ఉపవాచకాలు ఉంటాయి. ఆంగ్లం సబ్జెక్టుకు వర్క్‌బుక్‌ ఉంటుంది. సాంఘిక శాస్త్రంలో నాలుగు, గణితంలో రెండు పుస్తకాలుంటాయి. కొత్తగా ముద్రితమయ్యే పుస్తకాల్లో ఒకవైపు పేజీలో ఆంగ్ల మాధ్యమం, రెండో వైపు తెలుగు లేదా ఉర్దూ మాధ్యమాలు ఉంటాయి’ అని తెలిపారు.

5వ తరగతి వరకు రెండు సెమిస్టర్లు: 1 నుంచి 5 తరగతులకు ప్రస్తుతం అమల్లో ఉన్న మూడు సెమిస్టర్ల స్థానంలో రెండు సెమిస్టర్ల విధానం అమల్లోకి రానుందని ఆయన తెలిపారు. 6, 7 తరగతుల ఆంగ్లం, గణితం, సైన్స్‌ సబ్జెక్టులు ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ మేరకు ఉంటాయన్నారు. 8వ తరగతి పాఠ్యపుస్తకాల్లో మార్పు ఉండదని, 10వ తరగతి సిలబస్‌ 2024-25 విద్యా సంవత్సరం నుంచి మారుతుందని వివరించారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇంటర్‌తో వాయుసేనలో అగ్నివీర్‌ ఉద్యోగాలు

‣ ఐఐటీలో న్యాయవిద్య

‣ భవిష్యత్తు శాస్త్రవేత్తలకు, ప్రొఫెసర్లకు నెట్‌!

‣ కాలుష్య నియంత్రణ బోర్డులో కొలువులు

‣ అమెరికాలో అడ్వాన్స్‌డ్‌ కోర్సులు ఇవే!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.