* త్వరలో కౌన్సెలింగ్ తేదీల వెల్లడి
ఈనాడు ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో ఐసెట్, ఈసెట్ ఫలితాల వెల్లడికి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఫలితాల వెల్లడికి సమాయత్తమవుతోంది. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ 2024 ఫలితాలను గురువారం (మే 30న) విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఐసెట్-2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు మే 30వ తేదీనే (గురువారం) విడుదకానున్నాయని సమాచారం. త్వరలో కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించనున్నారు. ఫలితాలను https://results.eenadupratibha.net/ లో చూసుకోవచ్చు.