* ఉదయం 11 గంటలకు విడుదల
* పరీక్ష రాసిన 6,30,633 మంది విద్యార్థులు
ఈనాడు ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల తేదీ వచ్చేసింది. ఈ మేరకు ఫలితాల వెల్లడికి విద్యా శాఖ సమాయత్తమవుతోంది. ఏప్రిల్ 22వ తేదీ (సోమవారం) ఉదయం 11 గంటలకు టెన్త్ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 18 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలను 6,30,633 మంది విద్యార్థులు రాశారు. ఇప్పటికే జవాబుపత్రాల మూల్యాంకనం, రీవెరిఫికేషన్, మార్కుల నమోదు పనులు పూర్తయ్యాయి. అధికారిక వెబ్సైట్తో పాటు రిజల్ట్స్ను https://pratibha.eenadu.net/ లో పొందవచ్చు.
ఏపీ పదో తరగతి పరీక్ష 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి
టెన్త్ తర్వాత ఉద్యోగాలు, కోర్సులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.