తిరుపతి (గాంధీరోడ్డు), న్యూస్టుడే: కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న తిరుపతిలోని భారత పాకశాస్త్ర సంస్థ (ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్)లో వివిధ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ శిక్షణ, ప్లేస్మెంట్ అధికారి చెల్లేశ్వరరావు తెలిపారు. మార్చి 28న కోర్సులకు సంబంధించిన బ్రోచర్లను వారు ఆవిష్కరించారు. భారత పాకశాస్త్ర సంస్థ తిరుపతిలో మాత్రమే ఉందని, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యువతీ, యువకులు కలినరీ ఆర్ట్స్లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నట్లు వెల్లడించారు. తితిదే, ఐఆర్సీటీసీ, స్టార్ హోటళ్లు, పర్యాటక, తదితర శాఖ విభాగాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. బీబీఏ, ఎంబీఏ కోర్సులతోపాటు నూతనంగా బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు అందుబాటులో ఉందన్నారు. ఇంటర్మీడియట్లో 50 శాతం ఉత్తీర్ణతతో కోర్సులో చేరవచ్చని.. ఏపీలోని యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు 99854 86271లో సంప్రదించాలని ఆయన సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ షిప్పింగ్ కోర్సులతో మేటి అవకాశాలు
‣ మార్కెట్ మందగమనంలో ఉద్యోగ సాధన!
‣ స్పీచ్, హియరింగ్ చికిత్సలో ప్రత్యేక కోర్సులు
‣ ఇంటర్మీడియట్తో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ
‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు
‣ మలిదశ పరీక్షలో గెలుపు వ్యూహం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.