గుంటూరు(జిల్లా పరిషత్), న్యూస్టుడే: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సార్వత్రిక, దూర విద్యా కేంద్రం ఆధ్వర్యంలో జులైలో నిర్వహించనున్న వ్యవసాయ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ కె.గురవారెడ్డి తెలిపారు. మిద్దె తోటలు, పట్టు పురుగుల పెంపకం, జీవ ఎరువుల తయారీ కోర్సుల ప్రవేశాలకు జూన్ 20 లోపు రూ.1500 చొప్పున ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ www.angrau.ac.in ని సందర్శించాలని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మరింత సమాచారం ... మీ కోసం!