* అభ్యంతరాలకు గడువు మే 31
ఈనాడు ప్రతిభ డెస్క్: ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసులో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (Deputy Educational Officer) ప్రిలిమినరీ పరీక్ష (Screening Test) ప్రాథమిక కీ విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) వెల్లడించింది. కీపై అభ్యంతరాలు మే 29 నుంచి 31వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా తెలియజేయవచ్చు. పరీక్ష మే 25న నిర్వహించారు. పరీక్షకు 28,451 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా 18,037 (82.02 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులకు గతంలో నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. స్క్రీనింగ్, మెయిన్ (Main) పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.