ఈనాడు, హైదరాబాద్: ఉదయం వచ్చినప్పుడు, సాయంత్రం వెళ్లేప్పుడు.. ఇలా రోజుకు రెండుసార్లు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు వేయాల్సిందే. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరును తీసుకునేందుకు విశ్వవిద్యాలయాలు ఆదేశాలు జారీ చేశాయి. ఇప్పటికే తెలుగు విశ్వవిద్యాలయం ఆదేశాలు ఇవ్వగా.. సోమవారం జేఎన్టీయూ సైతం బయోమెట్రిక్ హాజరు తప్పనిసరని అన్ని ప్రైవేటు కళాశాలలకు స్పష్టం చేసింది. ఈ మేరకు రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ ఆదేశాలు జారీ చేశారు. బయోమెట్రిక్ హాజరు రెండుసార్లు ఉంటుందని తెలుగు విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది. బోధన సిబ్బంది ఉదయం 10.30 గంటలకు మొదటి వేలిముద్ర వేయాలి. సాయంత్రం 4.30 గంటలకు మరోసారి నమోదు చేయాలని రిజిస్ట్రార్ భట్టు రమేశ్ ఆదేశాలు జారీ చేశారు. బోధనేతర సిబ్బంది ఉదయం 10.30 గంటలకు.. సాయంత్రం 5 గంటలకు, విద్యార్థులు ఉదయం 10.30 గంటలకు, సాయంత్రం 4.30 గంటలకు వేలిముద్ర వేసి హాజరు వేయించుకోవాలి.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఆఫీసర్ కొలువుకు నౌకాదళం పిలుపు!
‣ ఒక్క ఛాన్స్ కాదు... అనేక ఛాన్సులు!
‣ కోర్సు పూర్తి కాగానే కొలువుల్లోకి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.