- అభ్యంతరాలకు గడువు ఆగస్టు 5
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో డివిజనల్ అకౌంట్స్ అధికారుల(డీఏవో) పోస్టుల భర్తీకి జూన్ 30 నుంచి జులై 4వ తేదీ వరకు నిర్వహించిన సీబీఆర్టీ పరీక్షల ప్రాథమిక ‘కీ’ని జులై 31న విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘కీ’తోపాటు అభ్యర్థుల సమాధానాల పత్రాలను వెబ్సైట్లో పొందుపరచుతామన్నారు. సమాధాన పత్రాలు ఆగస్టు 30 వరకు వెబ్సైట్లో ఉంటాయన్నారు. ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు ఆగస్టు 1 నుంచి 5 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నమోదు చేయాలని అభ్యర్థులకు సూచించారు.
- Read Latest jobs, Latest notifications and Latest govt jobs
- Follow us on Facebook, Twitter, Share chat, Google News
- Subscribe our Youtube Channel