నారాయణగూడ, న్యూస్టుడే: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2020-21 విద్యా సంవత్సరానికిగాను దూరవిద్య కేంద్రం ద్వారా వివిధ కోర్సులకు 2022 నవంబరులో నిర్వహించిన పరీక్షల ఫలితాలను వర్సిటీ ఫిబ్రవరి 1న విడుదల చేసింది. బ్యాక్ లాగ్ కోర్సులైన ఎంఏ (జ్యోతిషం, తెలుగు, సంస్కృతం, టూరిజం, మేనేజ్మెంట్), బీఏ (కర్ణాటక సంగీతం, స్పెషల్ తెలుగు)లతో పాటు ప్రస్తుతం నిర్వహిస్తున్న కోర్సులు పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు, డిప్లొమా (లలిత సంగీతం, ఫిల్మ్ రైటింగ్, జ్యోతిషం), సర్టిఫికెట్ కోర్సులో జ్యోతిషం, సంగీత విశారద కోర్సులలో ప్రవేశం పొందిన విద్యార్థులకు గత ఏడాది నవంబరులో నిర్వహించిన పరీక్షల ఫలితాలను వర్సిటీ వెబ్సైట్ www.teluguuniversity.ac.in లో చూడవచ్చునని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సి.మురళీకృష్ణ తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ వచ్చేస్తున్నాయ్... వర్చువల్ ల్యాబ్స్!
‣ టెన్త్ మార్కులతో పోస్టల్ ఉద్యోగం!
‣ బీటెక్ డిగ్రీతోపాటు నేవీలో ఉద్యోగం!
‣ కోస్ట్గార్డ్ కొలువు కావాలా?