• facebook
  • whatsapp
  • telegram

EAMCET Counselling: ఎంసెట్‌ బైపీసీ చివరి విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం

* 23 లోపు సీట్ల కేటాయింపు


ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌ బైపీసీ విద్యార్థులు బీ ఫార్మసీ, ఫార్మా డి తదితర కోర్సుల్లో చేరేందుకు చివరి విడత కౌన్సెలింగ్‌ సెప్టెంబ‌రు 17న‌ ప్రారంభమైంది. తొలి విడత కౌన్సెలింగ్‌ కన్వీనర్‌ కోటాలో రెండు కోర్సుల్లో కలిపి 9,362 సీట్లు అందుబాటులో ఉండగా.. వాటిలో 9,168 భర్తీ అయ్యాయి. 194 సీట్లు మిగిలిపోయాయి. అయితే సీట్లు పొందిన వారు రిపోర్టింగ్‌ చేయకపోవడంతోపాటు కాకతీయ వర్సిటీ, జేఎన్‌టీయూహెచ్‌ మరికొన్ని కళాశాలల్లో సీట్లకు అనుమతి ఇచ్చింది. ఫలితంగా చివరి విడతకు బీ ఫార్మసీలో 3,523, ఫార్మా డి కోర్సులో 525 సీట్లు అందుబాటులో ఉన్నాయి. చివరి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా సెప్టెంబ‌రు 19న ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. సెప్టెంబ‌రు 20వ తేదీ వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. సెప్టెంబ‌రు  23 లోపు సీట్లు కేటాయిస్తారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎల్లలు లేని క్రయవిక్రయాలు!

‣ భాస్కరుడిపై భారత్‌ దృష్టి!

‣ యువతకు అవశ్యం ‘హరిత నైపుణ్యం’

‣ పఠన నైపుణ్యం పెంపొందించుకుందాం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.