* వీఐటీ ప్రాంగణంలో కరుణానిధి పేరుతో వసతిగృహం ప్రారంభం
చెన్నై (టీనగర్), న్యూస్టుడే: ఇతరులు అపహరించలేనిది చదువు మాత్రమేనని, ఆ ఆస్తిని విద్యార్థులు కాపాడుకొని తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సూచించారు. వేలూర్ వీఐటీ ప్రాంగణంలో ముత్తమిళ్ కలైజ్ఞర్ కరుణానిధి పేరిట నిర్మించిన విద్యార్థుల వసతిగృహం, పెరల్ రీసెర్చి పార్కు ప్రారంభోత్సవాలను ఫిబ్రవరి 1న సాయంత్రం నిర్వహించారు. వీఐటీ కులపతి జి.విశ్వనాథన్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం హాజరయ్యారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... కలైజ్ఞర్ పేరిట రూ.80 కోట్ల వ్యయంతో 379 మంది విద్యార్థుల బసకు వీలుగా నిర్మించిన భవనం, రీసెర్చి పార్కును ప్రారంభించడం ఆనందదాయకమని అన్నారు. కులపతిగా ఉన్న విశ్వనాథన్.. అన్నాదురై హయాంలోనే డీఎంకే తరఫున విద్యార్థి సంఘాన్ని ఏర్పాటుచేశారని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి కరుణానిధితో తనకు 50 ఏళ్ల అనుబంధం ఉండేదని కులపతి జి.విశ్వనాథన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు దురైమురుగన్, కె.పొన్ముడి తదితరులు ప్రసంగించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ వచ్చేస్తున్నాయ్... వర్చువల్ ల్యాబ్స్!
‣ టెన్త్ మార్కులతో పోస్టల్ ఉద్యోగం!
‣ బీటెక్ డిగ్రీతోపాటు నేవీలో ఉద్యోగం!
‣ కోస్ట్గార్డ్ కొలువు కావాలా?
‣ సరైన రివిజన్ సక్సెస్ సూత్రం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.