* ఎన్ఎంసీ ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో మరో పది మెడికల్ పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కాకతీయ వైద్య కళాశాలకు ఎమర్జెన్సీ మెడిసిన్ పీజీలో అయిదు, నెఫ్రాలజీ విభాగంలో మరో అయిదు డీఎం సీట్లు మంజూరు చేస్తూ జాతీయ వైద్యమండలి (ఎన్ఎంసీ) ఉత్తర్వులు జారీచేసింది. ఎమర్జెన్సీ మెడిసిన్లో పీజీ సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటిసారిగా అందుబాటులోకి వచ్చాయి. తాజాగా మంజూరైన వాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 2,558 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అదనపు సీట్లు రావడంపై రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు వైద్యవిద్య డైరెక్టరేట్ (డీఎంఈ)ని అభినందించారు. ఇది చాలా మంచి పరిణామమని ట్విటర్లో పేర్కొన్నారు.
వాళ్లు రియల్ హీరోలు..: సీపీఆర్ ద్వారా ప్రాణాలను కాపాడుతున్నవారు రియల్ హీరోలని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సీపీఆర్పై అందరికీ అవగాహన పెరిగితే ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని ట్విటర్లో పేర్కొన్నారు. కుకునూర్పల్లి మండలం చిన్నకిష్టాపురానికి చెందిన రాజు అనే యువకుడి ప్రాణాలు కాపాడిన 108 ఉద్యోగులు మహేందర్, రమేశ్లను అభినందించారు. కారులో గుండెపోటుకు గురైన వ్యక్తికి సీపీఆర్ చేసి రామన్నపేట సీఐ మోతిరాం మానవత్వం చాటుకున్నారని అన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.