• facebook
  • whatsapp
  • telegram

PG Medical: కొత్తగా పది మెడికల్‌ పీజీ సీట్లు

* ఎన్‌ఎంసీ ఉత్తర్వులు


ఈనాడు, హైదరాబాద్‌:  రాష్ట్రంలో మరో పది మెడికల్‌ పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. కాకతీయ వైద్య కళాశాలకు ఎమర్జెన్సీ మెడిసిన్‌ పీజీలో అయిదు, నెఫ్రాలజీ విభాగంలో మరో అయిదు డీఎం సీట్లు మంజూరు చేస్తూ జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) ఉత్తర్వులు జారీచేసింది. ఎమర్జెన్సీ మెడిసిన్‌లో పీజీ సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటిసారిగా అందుబాటులోకి వచ్చాయి. తాజాగా మంజూరైన వాటితో కలిపి రాష్ట్రంలో మొత్తం 2,558 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అదనపు సీట్లు రావడంపై రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వైద్యవిద్య డైరెక్టరేట్‌ (డీఎంఈ)ని అభినందించారు. ఇది చాలా మంచి పరిణామమని ట్విటర్‌లో పేర్కొన్నారు. 
వాళ్లు రియల్‌ హీరోలు..: సీపీఆర్‌ ద్వారా ప్రాణాలను కాపాడుతున్నవారు రియల్‌ హీరోలని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సీపీఆర్‌పై అందరికీ అవగాహన పెరిగితే ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని ట్విటర్‌లో పేర్కొన్నారు. కుకునూర్‌పల్లి మండలం చిన్నకిష్టాపురానికి చెందిన రాజు అనే యువకుడి ప్రాణాలు కాపాడిన 108 ఉద్యోగులు మహేందర్, రమేశ్‌లను అభినందించారు. కారులో గుండెపోటుకు గురైన వ్యక్తికి సీపీఆర్‌ చేసి రామన్నపేట సీఐ మోతిరాం మానవత్వం చాటుకున్నారని అన్నారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 31-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.