• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 26-03-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)  

1.  ప్రపంచ కుబేరిడిగా ఎలాన్‌ మస్క్‌

హురున్‌ 2024 సంవత్సరానికి గాను విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ అగ్రస్థానంలో నిలిచారు. ఈయన సంపద విలువ 231 బి.డాలర్లు (సుమారు రూ.19 లక్షల కోట్లు). దేశీయ కుబేరుల్లో అగ్రస్థానాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ నిలబెట్టుకున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



 


2.   మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ అధిపతిగా పవన్‌ దావులూరి 

మైక్రోసాఫ్ట్‌ విండోస్, సర్ఫేస్‌కు కొత్త అధిపతిగా ఐఐటీ మద్రాస్‌ పూర్వ విద్యార్థి పవన్‌ దావులూరి నియమితులయ్యారు. ఈ బాధ్యతల్లో ఉన్న పనోస్‌ పనయ్‌ గతేడాది అమెజాన్‌కు వెళ్లడంతో తాజా నియామకం చోటు చేసుకుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...





3.  కాలిఫోర్నియా వర్సిటీ డిగ్రీనీ వదులుకున్న సందీప్‌పాండే

దాదాపు ఆర్నెల్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ - పాలస్తీనా యుద్ధంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా గత జనవరిలో రామన్‌ మెగసెసె అవార్డు వదులుకొంటున్నట్లు ప్రకటించిన సామాజిక ఉద్యమకారుడు సందీప్‌పాండే బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా నుంచి తాను చేసిన పీహెచ్‌డీ డిగ్రీని సైతం తాజాగా వెనక్కు ఇచ్చేశారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...




 

4.  ఓటీపీ మోసాలకు విరుగుడు ‘అడాప్‌ఐడీ’

ఆధునిక కాలంలో ఓటీపీ మోసాలు, పాస్‌వర్డ్‌ హ్యాకింగ్‌ ఉదంతాలు ఎక్కువయ్యాయి. వీటి కట్టడికి హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ ఐఐటీ శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మక వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇది.. ఆయా వినియోగదారుల బయోమెట్రిక్‌ వ్యవహారశైలి పోకడల ఆధారంగా వారిని ధ్రువీకరించుకుంటుంది. ఈ వ్యవస్థకు ‘అడాప్‌ఐడీ’ అని పేరు పెట్టారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


 

5.  శ్రీజకు కెరీర్‌ ఉత్తమ ర్యాంకు 

భారత యువ టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ ఆకుల శ్రీజ కెరీర్‌లో ఉత్తమ ర్యాంకు సాధించింది. తాజా ప్రపంచ టీటీ ర్యాంకింగ్స్‌ మహిళల సింగిల్స్‌లో ఈ తెలుగమ్మాయి 40వ ర్యాంకులో నిలిచింది. డబ్ల్యూటీటీ ఫీడర్‌ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శనతో టైటిల్‌ గెలిచిన  శ్రీజ.. ఏడు ర్యాంకులు మెరుగుపరుచుకుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



 

6.  భారత్‌లో యూట్యూబ్‌ తొలగించిన వీడియోలు 22.5 లక్షలు 

సామాజిక మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు మన దేశానికి చెందిన 22.5 లక్షల వీడియోలను గత ఏడాది అక్టోబరు- డిసెంబరు మధ్య యూట్యూబ్‌ తొలగించింది. ఈ విషయంలో 30 దేశాల్లో అగ్రస్థానంలో మన దేశం ఉంది. జాబితాలో రెండో స్థానంలో సింగపూర్‌ ఉంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


 

7.  రామకృష్ణ మిషన్‌ అధ్యక్షుడి మరణం

రామకృష్ణ మిషన్‌ అధ్యక్షుడు స్వామి స్మరణానంద (95) కోల్‌కతాలో మరణించారు. రామకృష్ణ మిషన్‌కు 2017లో స్మరణానంద 17వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.