• facebook
  • whatsapp
  • telegram

TS EAPCET: టీఎస్‌ ఈఏపీసెట్‌ సెంటర్లు పెంచే యోచన: జేఎన్‌టీయూ

కూకట్‌పల్లి, న్యూస్‌టుడే: టీఎస్‌ ఈఏపీసెట్‌-24 పరీక్షా కేంద్రాలను పెంచే యోచనలో జేఎన్‌టీయూ అధికారులు ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇంజినీరింగ్‌కు 1,93,468 దరఖాస్తులు రాగా.. అగ్రికల్చర్‌, ఫార్మసీలో 71,999మంది దరఖాస్తు చేశారు. రెండు విభాగాల్లో కలిపి మొత్తం ఇప్పటికే 2,66,121మంది దరఖాస్తు చేశారు. ఇంకా దరఖాస్తు గడువుకు 9రోజుల సమయం ఉంది.  వచ్చిన దరఖాస్తుల్లో ఇంజినీరింగ్‌లో తెలంగాణ నుంచి 1,63,748, ఏపీ నుంచి 29,720మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. ఈసారి ఈఏపీసెట్‌ పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశాలను దృష్టిలో పెట్టుకొని  రెండు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన 208పరీక్షా కేంద్రాలకు అదనంగా మరిన్ని పెంచాలని సమాలోచనలు చేస్తున్నట్లు సెట్‌ కో-కన్వీనర్‌ డాక్టర్‌ కె.విజయ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌ నగరం, ఏపీలో కొన్ని కేంద్రాలు పెంచాలని నిర్ణయించినట్లు వివరించారు. దీనిపై ఒకటి, రెండురోజుల్లో  తుది నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొన్నారు.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

‣ స్పీచ్‌, హియ‌రింగ్ చికిత్స‌లో ప్ర‌త్యేక కోర్సులు

‣ ఇంటర్మీడియ‌ట్‌తో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.