* దోనూరు అనన్యరెడ్డికి 1065 మార్కులు
* ఆదిత్య శ్రీవాస్తవకు 1099 మార్కులు
ఈనాడు ప్రతిభ డెస్క్: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 తుది ఫలితాల ర్యాంకర్ల మార్కులు వెల్లడయ్యాయి. ఈ జాబితాలో అభ్యర్థుల రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మొత్తం మార్కులు, ర్యాంకుల వివరాలు పొందుపరిచారు. మొదటి ర్యాంకర్ ఆదిత్య శ్రీవాస్తవకు మొత్తం 2025 మార్కులకు గాను 1099 మార్కులు, రెండో ర్యాంకర్ అనిమేష్ ప్రధాన్కు 1067 మార్కులు, మూడో ర్యాంకర్ దోనూరు అనన్యరెడ్డికి 1065 మార్కులు సాధించారు. తెలంగాణ, ఏపీల నుంచి సుమారు 60 మంది విజేతలుగా నిలిచిన విషయం తెలిసిందే. మహబూబ్నగర్కు చెందిన దోనూరు అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలోనే జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు వందలోపు ర్యాంకులు, 11 మంది 200లోపు ర్యాంకులు పొందారు. లఖ్నవూకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ పరీక్షలో తొలి స్థానంలో నిలిచారు. ఒడిశాలోని అనుగుల్ జిల్లా తాల్చేరు వాసి అనిమేష్ ప్రధాన్ ద్వితీయ స్థానంలో నిలిచారు. పి.కె.సిద్ధార్థ్ రామ్కుమార్, రుహానీలు వరుసగా నాలుగు, అయిదు స్థానాలు దక్కించుకున్నారు. మొత్తం 1,016 మంది విజయం సాధించగా వారిలో 664 మంది పురుషులు, 352 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 30 మంది దివ్యాంగులు ఉండడం విశేషం. జనరల్ విభాగంలో 347 మంది, ఈడబ్ల్యూఎస్లో 115, ఓబీసీ 303, ఎస్సీ 165, ఎస్టీ విభాగంలో 86 మంది ఉద్యోగాలు సాధించారు. గతేడాది మే 28న జరిగిన సివిల్స్-2023 ప్రాథమిక పరీక్షకు మొత్తం 10,16,850 నమోదు చేసుకోగా 5,92,141 మంది హాజరయ్యారు. వారిలో 14,624 మంది మెయిన్స్కు, 2,855 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. చివరగా 1,016 మంది అత్యున్నత కొలువులు సాధించారు.
సివిల్స్ తుది ఫలితాల మార్కుల జాబితా కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.