* 12.30 గంటలకు విడుదల
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ 2024 ఫలితాలను సోమవారం (మే 20న) విడుదల చేయనున్నారు. ఆరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ లింబాద్రి ఫలితాలను విడుదల చేస్తారని ఈసెట్ కన్వీనర్ తెలిపారు. ఫలితాలను https://results.eenadupratibha.net/ లో చూసుకోవచ్చు.