* మొత్తం 1185 అభ్యర్థుల ఎంపిక
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణలో గురుకుల పోస్టుల వ్యాయామ ఉపాధ్యాయులు నియామకాల(నోటిఫికేషన్ నంబర్ 16/2017)కు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. 1:2 నిష్పత్తి ప్రకారం మొత్తం 1185 అభ్యర్థుల ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు 29/05/2024 నుంచి 04/06/2024 వరకు హైదరాబాద్లోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. మే 28 నుంచి జూన్ 4 వరకు వెబ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీల్లో పీఈటీ ఖాళీలకు గాను 2017 సెప్టెంబర్ 17, 18 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించగా.. ప్రస్తుతం నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది.