ఈనాడు, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లించేందుకు తత్కాల్ పథకం కింద రూ.వెయ్యి ఆలస్య రుసుంతో మరో అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఫిబ్రవరి 15వ తేదీ వరకు నిర్ణీత రుసుంను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు చెల్లించాలని సూచించారు.
పాఠశాలలకు రూ.918 కోట్ల నాబార్డు నిధులు
రాష్ట్రంలోని 4,148 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం నాబార్డు నుంచి రూ.918 కోట్లు మంజూరయ్యాయి. వాటికి రాష్ట్ర వాటాగా రూ.162 కోట్లు కలిపి మొత్తం రూ.1080 కోట్లను పాఠశాల విద్యాశాఖ వినియోగించుకునేందుకు వీలుగా అనుమతిస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి 4న ఉత్తర్వు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమానికి నాబార్డు నుంచి కూడా నిధులు సమీకరిస్తున్న విషయం తెలిసిందే.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.