ఈనాడు, హైదరాబాద్: అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఉన్న ప్రముఖ అబర్న్ విశ్వవిద్యాలయంలో అటవీ కోర్సులో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం రాష్ట్రంలో ఏటా ఇద్దరు ప్రతిభావంతులైన విద్యార్థులకు దక్కనుంది. సిద్దిపేట జిల్లా ములుగులో ఉన్న ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎఫ్సీఆర్ఐ)లో బీఎస్సీ ఫారెస్ట్రీ చదివిన విద్యార్థుల్లో ఇద్దరికి ఎమ్సెస్సీ ఫారెస్ట్రీ కోసం పూర్తి ఫండింగ్ ఇచ్చేందుకు అబర్న్ యాజమాన్యం అంగీకరించింది. ఈ మేరకు అమెరికాలోని ఈ యూనివర్సిటీ ప్రాంగణంలో శనివారం ఒప్పందం కుదిరింది. అబర్న్ వర్సిటీ డీన్ జానకి అలవలపాటి, తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ డీన్ ప్రియాంకా వర్ఘీస్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ఆరేళ్ల పాటు అమల్లో ఉంటుంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.