ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో 6 - 10 తరగతులకు బోధించే సబ్జెక్టు ఉపాధ్యాయులకు అదనపు కంటెంట్తో కూడిన ట్యాబ్లను ఉచితంగా అందించనున్నామని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. ఉపాధ్యాయులతో మార్చి 23న నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సవరించిన కంటెంట్ను ఏప్రిల్ 30లోపు ట్యాబ్ల్లో అప్లోడ్ చేయనున్నామని, వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులు ఈ వీడియోలు చూడొచ్చని సూచించారు. ఇప్పటికే 3 వేల బడుల్లో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్, ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్లో స్మార్ట్టీవీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఫార్మెటివ్-4 పరీక్షలకు ముందే సిలబస్ను పూర్తి చేయాలని సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ పూర్తిగా మారనున్న 9వ తరగతి సిలబస్
‣ సీఆర్పీఎఫ్లో 9212 కానిస్టేబుల్ పోస్టులు
‣ మేనేజర్లకు టూరిజం స్వాగతం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.