బేగంపేట, న్యూస్టుడే: గీతం డీమ్డ్ యూనివర్సిటీ జీఏటీ-2023 అడ్మిషన్లకుగాను మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వైస్ఛాన్సలర్ డి.ఎస్.రావు తెలిపారు. మార్చి 24న ఆయన బేగంపేటలోని ఓ హోటల్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు ప్రాంగణాలలోని అండర్ గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి 48 కేంద్రాలలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహించనున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయం జీఏటీ, జేఈఈ మెయిన్, ఏపీ, టీఎస్ ఎప్సెట్లలో అగ్రర్యాంకులు సాధించిన విద్యార్థులతోపాటు అర్హులైనవారికి మెరిట్ స్కాలర్షిప్లు అందజేయన్నుట్లు చెప్పారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ చెత్తను వదిలించే చక్కటి ఉద్యోగం!
‣ గ్రూప్-2కి సమగ్ర సన్నద్ధత ఎలా?
‣ రివిజన్..ప్రాక్టీస్.. సక్సెస్ సూత్రాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.