ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని సాధారణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో ఉమ్మడి టైం టేబుల్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8.15 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు విద్యార్థులకు బోధన తరగతులు ఉంటాయి. వారిని తెల్లవారుజామున ఐదు గంటలకు మేల్కొలుపుతారు. ఉదయం ఏడు గంటలకు టిఫిన్ ఇస్తారు. 5, 6, 7 తరగతులకు మధ్యాహ్నం 12.45 నుంచి 1.30 వరకు, ఎనిమిదో తరగతి నుంచి పైతరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం 1.25 నుంచి 2.15 గంటల వరకు భోజనం అందిస్తారు. సాయంత్రం 4.30 నుంచి 4.45 వరకు స్నాక్స్, అనంతరం 5.45 వరకు క్రీడలు ఉంటాయి. రాత్రి భోజనం సాయంత్రం 6.15 నుంచి ఏడు గంటల వరకు ఉంటుంది. రాత్రి తొమ్మిది గంటలకు విద్యార్థులు నిద్రపోతారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ గ్రూపు-1 మెయిన్స్ 100 రోజుల వ్యూహాం!!
‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!
‣ కేంద్ర శాఖల్లో 17,727 కొలువులు!
‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.