నిట్ క్యాంపస్, న్యూస్టుడే: నూతన విద్యావిధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం బీఈడీతో కూడిన నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సును అమలు చేయాలని నిర్ణయించింది. రాబోయే విద్యాసంవత్సరానికి దేశవ్యాప్తంగా 57 కళాశాలల్లో కోర్సును ప్రారంభించనుంది. రాష్ట్రంలో వరంగల్ నిట్, మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని మోడల్ డిగ్రీ కళాశాలకు అనుమతి లభించింది. ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం(ఐటీఈపీ)లో భాగంగా బీఈడీతో కూడిన జాతీయ స్థాయి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సు నిర్వహిస్తారు. బీఎస్సీ, బీఏ, బీకాం, డిగ్రీ కోర్సులతో పాటు సమాంతరంగా నాలుగేళ్ల వ్యవధిలోనే బీఈడీ పూర్తి చేసుకునే వెసులుబాటు కలగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ఆధ్వర్యంలో ప్రవేశాల ప్రక్రియ జరుగుతుంది. జాతీయ స్థాయి ఉమ్మడి ప్రవేశపరీక్ష (ఎస్సీఈటీ)లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు.
బీఈడీ విద్యార్థులకు వెసులుబాటు
సాధారణంగా మూడేళ్ల డిగ్రీ తర్వాత బీఈడీ ప్రవేశ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాలి. అదనంగా మరో రెండేళ్లు కోర్సు పూర్తిచేయాలి. మొత్తం అయిదేళ్లు పడుతుంది. ఇంటిగ్రేటెడ్ బీఈడీలో చేరితే నాలుగేళ్లలోనే డిగ్రీతో పాటు బీఈడీ పూర్తిచేసే వెసులుబాటు ఉంటుంది. ఇది పూర్తిచేసినవారు నాలుగంచెల్లో నిర్వహించే ఫౌండేషన్, ప్రీప్రైమరీ, మిడిల్, సెకండరీ విధానంలో బోధనకు అర్హులు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సైబర్ సెక్యూరిటీలో ఏ కోర్సులు?ఎలాంటి ఉద్యోగాలు?
‣ మెరుగైన పీజీకి మేలైన మార్గం!
‣ చివరి వరకు స్ఫూర్తిని కొనసాగించాలంటే?
‣ శాంతిభద్రతల సంరక్షణసేనలోకి స్వాగతం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.