రాంపూర్ (కరీంనగర్): బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్-1 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ ఎం.రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆసక్తిగల వారు మార్చి 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో ఇక్కడ శిక్షణ పొందిన వారు అనర్హులని చెప్పారు. అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండి, పదోతరగతి, ఇంటర్, డిగ్రీలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. ఇతర వివరాలకు కరీంనగర్లోని స్టడీ సర్కిల్లో సంప్రదించాలని కోరారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ శాంతిభద్రతల సంరక్షణసేనలోకి స్వాగతం!
‣ ప్రఖ్యాత సంస్థలో పరిశోధన డిగ్రీ
‣ ఉన్నత విద్యకు రమ్మంటోంది.. యూకే!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.