ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ మార్చి 24న ప్రకటన విడుదల చేసింది. ఒకటో తరగతిలో ప్రవేశాలకు మార్చి 31 నాటికి ఆరేళ్లు నిండిన వారు అర్హులు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ వెబ్సైట్లో దరఖాస్తులు 27వ తేదీ ఉదయం పది గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. దరఖాస్తుల సమర్పణకు తుది గడువు ఏప్రిల్ 17వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంది. వెబ్సైట్: https://kvsonlineadmission.kvs.gov.in/ ఆన్లైన్ ప్రవేశాలకు మొబైల్ యాప్ను వినియోగించుకోవచ్చు. యాప్ https://kvsonlineadmission.kvs.gov.in/apps/ రెండో తరగతి ఆపైన తరగతుల్లో ఖాళీల ఆధారంగా ప్రవేశాలకు అనుమతిస్తారు. ఆయా పాఠశాలల్లోనే దరఖాస్తులు తీసుకొని సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ మూడో తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఆయా పాఠశాలల్లో స్వయంగా దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ టీఎస్పీఎస్సీ - త్వరలో కొత్త పరీక్షల తేదీలు
‣ ఇంటర్తో వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.