1. వ్యవసాయ అధికారుల పోస్టులకు ఏప్రిల్ 25న పరీక్ష
వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించి.. అయిదు ఉద్యోగ ప్రకటనల్లోని పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ.. రాత పరీక్షల (కంప్యూటర్ ఆధారిత/ఓఎంఆర్) షెడ్యూలు ప్రకటించింది. కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ జనవరి 30న ఈ వివరాలతో ఓ ప్రకటన విడుదల చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. సింగరేణిలో 558 ఉద్యోగాలు
సింగరేణిలో 558 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈమేరకు ఫిబ్రవరి మొదటి వారంలోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని సంస్థ డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. కొత్తగూడెంలో జనవరి 30న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. 11న మెగా జాబ్ మేళా
నిరుద్యోగులు జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకుని, ప్రతిభతో ఉద్యోగాలు సంపాదించుకోవాలని మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 11న సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించే మెగా జాబ్ మేళా గోడపత్రికను మంత్రి నివాసంలో ఎమ్మెల్యేతో కలిసి జనవరి 30న ఆవిష్కరించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ఓయూలో పీహెచ్డీ ప్రవేశాల ప్రకటన జారీ
ఉస్మానియా యూనివర్సిటీలో క్యాటగిరీ-2లో పీహెచ్డీ అడ్మిషన్ ప్రకటనను జనవరి 30న విడుదల చేశారు. ఓయూ పీహెచ్డీ సెట్లో అర్హత సాధించిన విద్యార్థులు ఫిబ్రవరి 1నుంచి 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. ఇంటర్ వృత్తి విద్యా కోర్సులకు ఆన్లైన్ మూల్యాంకనం
ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సుల పరీక్షల సమాధాన పత్రాలను ఆన్లైన్లో మూల్యాంకనం చేసేందుకు ఇంటర్ విద్యామండలి కసరత్తు చేస్తోంది. ప్రయోగాత్మకంగా వృత్తి విద్యా కోర్సుల్లో ముందుగా అమలు చేయాలని భావిస్తోంది. ఇది సత్ఫలితాలు ఇస్తే భవిష్యత్తులో మిగతా వాటికి వర్తింప చేయనున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.