• facebook
  • whatsapp
  • telegram

Latest News: 01-02-2023 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. జూన్‌ 5 నుంచి గ్రూపు-1 పరీక్షలు

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్‌సీ) గ్రూప్‌ ప్రధాన (మెయిన్స్‌) పరీక్షల తేదీలను ఖరారు చేసింది. ఈ మేరకు షెడ్యూల్‌ను జ‌న‌వ‌రి 31న విడుదల చేసింది. వచ్చే జూన్‌ 5 నుంచి 12 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి తాజా, రెన్యువల్‌ పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల కోసం కళాశాలలు,..

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. ఏప్రిల్‌లో సార్వత్రిక విద్యా పీఠం పరీక్షలు

సార్వత్రిక విద్యా పీఠం పది, ఇంటర్మీడియట్‌ పరీక్షలను ఏప్రిల్‌ మూడు నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు డైరెక్టర్‌ శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పరీక్షలు ఉంటాయని, ప్రాక్టికల్‌ పరీక్షలు...

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కోర్సులు

రాష్ట్రంలో క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఎమర్జింగ్‌ టెక్నాలజీ రీస్కిల్లింగ్‌ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. నాస్కామ్‌ ఫ్యూచర్‌ స్కిల్స్‌ ప్రైమ్‌, గుగూల్‌ క్లౌడ్‌తో సహకారంతో వీటిని అమలు చేయనున్నట్లు తెలిపింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. ఓపెన్‌ పది, ఇంటర్‌ పరీక్షల ఫీజు గడువు 10

తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్‌) ఆధ్వర్యంలో ఏప్రిల్‌/మేలో నిర్వహించే పది, ఇంటర్‌ వార్షిక పరీక్షల ఫీజు షెడ్డ్యూల్‌ను హనుమకొండ డీఈవో డా.ఎండీ.అబ్దుల్‌హై, ఉమ్మడి పరీక్షల సహాయ అధికారి డి.చలపతిరావు జనవరి 31న విడుదల చేశారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.