1. కేజీబీవీల్లో ప్రవేశాలకు 27 నుంచి దరఖాస్తుల స్వీకరణ
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో ఆరో తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర పథ సంచాకులు సురేష్ కుమార్ తాజాగా తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. టీఎస్పీఎస్సీ నియామక పరీక్షలు ఆన్లైన్లో..!
ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పోటీపరీక్షల నిర్వహణ విధానంలో కీలక మార్పులు చేయాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) భావిస్తోంది. వేగంగా రాత పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించేందుకు ఆన్లైన్ విధానం దిశగా అడుగులు వేస్తోంది. పరీక్ష పత్రాల తయారీ, భద్రత, తదితర సాంకేతిక ఇబ్బందులు లేకుండా భారీ...
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. కొత్తగా ఇంజినీరింగ్ కాలేజీలు పెట్టుకోవచ్చు
వచ్చే విద్యా సంవత్సరం(2023-24) దేశవ్యాప్తంగా కొత్తగా ఇంజినీరింగ్ కళాశాలలను పెట్టుకోవచ్చు. అందుకు 2020-21 విద్యా సంవత్సరం నుంచి కొనసాగుతున్న నిషేధాన్ని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఎత్తివేసింది. ఈ మేరకు బుధవారం నిర్ణయం తీసుకుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ఇంజినీరింగ్లో దిల్లీ ఐఐటీ భేష్.. ప్రపంచంలో 48వ స్థానం
ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి ప్రపంచంలోని 50 అత్యుత్తమ విద్యాసంస్థల్లో దిల్లీ ఐఐటీకి చోటు దక్కింది. గతేడాదితో పోలిస్తే 7 స్థానాలు మెరుగై 48వ ర్యాంకును సాధించింది. ఈ మేరకు 2023కుగానూ సబ్జెక్టులు, విభాగాల వారీగా ఉత్తమ వర్సిటీల జాబితాను క్వాక్వరెల్లి సైమండ్స్(క్యూఎస్) సంస్థ బుధవారం విడుదల చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. మొక్కుబడిగా డిగ్రీ ఇంటర్న్షిప్ వ్యవహారం
ప్రభుత్వం ఎంతో గొప్పగా చెబుతున్న డిగ్రీ ఇంటర్న్షిప్ మొక్కుబడి తంతుగా మారింది. విద్యార్థుల చదువుకు..వారి ఉపాధికి సంబంధం లేకుండా ఏదో ఒక దాంట్లో ఇంటర్న్షిప్ కేటాయించేస్తున్నారు. యువత ఆసక్తినీ పట్టించుకోవడం లేదు. విద్యార్థులను సర్దుబాటు చేసేందుకు స్థానికంగా పరిశ్రమలు లేకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.