• facebook
  • whatsapp
  • telegram

Latest News: 29-03-2023 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. 6 పేప‌ర్లు 33 ప్ర‌శ్న‌లు 100 మార్కులు

పదోతరగతి పరీక్షల్లో ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆరు పేపర్ల విధానం ఇప్పుడు విద్యార్థులకు కత్తి మీద సాములా మారింది. ఒకేసారి కొండంత సిలబస్‌ చదివి పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది ఏడు పేపర్ల విధానంలో పరీక్ష నిర్వహించగా, ప్రస్తుతం తొలిసారి ఆరు పేపర్లతో నిర్వహిస్తున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

2. హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పరీక్ష జూన్‌ 17న

రాష్ట్రంలో ఏప్రిల్‌ 4న జరగాల్సిన హార్టికల్చర్‌ ఆఫీసర్‌ ఎంపిక రాత పరీక్షను వాయిదా వేసినట్లు టీఎస్‌పీఎస్సీ మార్చి 28న‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పరీక్షను జూన్‌ 17న నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

3. రెండు ప్రయత్నాల్లో ఎంబీబీఎస్‌ పూర్తికి అవకాశం

కరోనా విస్తృతి సమయంలో ఉక్రెయిన్‌, చైనా, ఫిలిప్పీన్స్‌ల నుంచి వెనక్కి వచ్చేసిన భారతీయ వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్‌ తుది పరీక్షల్ని రెండు ప్రయత్నాల్లో పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. దేశంలోని ఏ వైద్య కళాశాలలోనూ చేరకుండానే ‘జాతీయ వైద్య కమిషన్‌’ పాఠ్యప్రణాళిక, మార్గదర్శకాలకు ...

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

4. 31న మెగా ఉద్యోగ మేళా

విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కళాశాలలో 31వ తేదీ శుక్రవారం మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బి.టెక్, పీజీ, ఫార్మసీ విద్యార్హతలు గల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

5. ఎంబీబీఎస్‌ ఫలితాల్లో 92.25 శాతం ఉత్తీర్ణత

ఎంబీబీఎస్‌ ఆఖరి సంవత్సరం పరీక్ష ఫలితాలను కాళోజీ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం మార్చి 28న‌  ప్రకటించింది. ఫిబ్రవరిలో జరిగిన చివరి సంవత్సరం (పార్ట్‌-2) రెగ్యులర్‌ పరీక్షల్లో మొత్తం 92.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 43 మంది డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులు కాగా.. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.