1. 20 నుంచి సమ్మెటివ్-2 పరీక్షలు
ఈనాడు డిజిటల్, అమరావతి: పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 20వ తేదీ నుంచి సమ్మెటివ్ పరీక్షలు-2 ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్కుమార్ మార్చి 31న విడుదల చేశారు. ఏప్రిల్ 20, 24, 25 తేదీల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. బడిలో ముఖ గుర్తింపు హాజరు
పాఠశాలల్లో ప్రమాణాలను పెంచేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణతో సమాయత్తమవుతోంది. వచ్చే విద్యా సంవత్సరం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై ముందస్తుగానే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇటీవల దిల్లీలో జరిగిన సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ రాష్ట్రంలో స్థితిగతులు, ....
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. జాతీయ స్థాయి ఇంటిగ్రేటెడ్ కోర్సుకు అనుమతి
నూతన విద్యావిధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం బీఈడీతో కూడిన నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సును అమలు చేయాలని నిర్ణయించింది. రాబోయే విద్యాసంవత్సరానికి దేశవ్యాప్తంగా 57 కళాశాలల్లో కోర్సును ప్రారంభించనుంది. రాష్ట్రంలో వరంగల్ నిట్, మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని మోడల్ డిగ్రీ కళాశాలకు అనుమతి లభించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పెంపు
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు ఏప్రిల్ 3 వరకు పొడగించినట్లు బీసీ స్టడీ సర్కిల్ సంచాలకుడు డాక్టర్ ఎంపీవీ.ప్రసాద్ మార్చి 31న ఒక ప్రకటనలో తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. 2 నుంచి సార్వత్రిక డిగ్రీ పరీక్షలు
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ విద్యార్థులకు ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమవుతాయని ప్రాంతీయ సమన్వయ అధికారి డాక్టర్ ఆడెపు శ్రీనివాస్ తెలిపారు
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.