1. టెట్లో 58.4% మంది అర్హత
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో 58.4% మంది ఉత్తీర్ణత సాధించారు. ఫిబ్రవరి-మార్చి నెలల్లో నిర్వహించిన టెట్కు 2,35,907 మంది హాజరుకాగా.. అందులో 1,37,903 మంది అర్హత సాధించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ జూన్ 25న ఎక్స్ వేదికగా విడుదల చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. ఎంబీబీఎస్లో ‘సి’ సీట్లు మేమే భర్తీ చేస్తాం
ఎంబీబీఎస్లో ‘సి’ కేటగిరీ సీట్లను తామే భర్తీ చేస్తామని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు ఇటీవల జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాలకు వెల్లడించింది. దీనిపై త్వరలోనే అధికారిక సమాచారం వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఉన్న మొత్తం సీట్లలో 15% సీట్లను ఓపెన్ కోటా కింద ఎన్ఎంసీ జాతీయ స్థాయిలో భర్తీ చేస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. వెబ్సైట్లో డీఏవో పరీక్ష హాల్టికెట్లు
డివిజనల్ ఎకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) గ్రేడ్-2 పోస్టుల భర్తీకి జూన్ 30 నుంచి జులై 4 వరకు నిర్వహించే పరీక్షలకు హాల్టికెట్లు..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. 30 వరకు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ డైట్ కళాశాల ప్రిన్సిపల్ కె.నారాయణరెడ్డి జూన్ 25న తెలిపారు. జూన్ 30 వరకు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. నేటి నుంచి ఏపీ ఈసెట్ కౌన్సెలింగ్
తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జూన్ 26 నుంచి ఏపీ ఈసెట్-2024 కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. డిప్లొమా (ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులందరూ ...
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.