* టెన్త్, డిగ్రీ అర్హతతో అవకాశం
![]() |
ఈనాడు ప్రతిభ డెస్క్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) తాజాగా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్) పరీక్ష-2024కు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని 17,727 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో జులై 24లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టైర్-1, టైర్-2 తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ)- కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ కార్యాలయాల్లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు జులై 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్)... రీజినల్ రూరల్ బ్యాంకు(ఆర్ఆర్బీ)ల్లో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్-XIII (సీఆర్పీ) ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 9,995 గ్రూప్ ఎ- ఆఫీసర్(స్కేల్-1, 2, 3), గ్రూప్ బి- ఆఫీస్ అసిస్టెంట్(మల్టీ పర్పస్) పోస్టులు భర్తీ కానున్నాయి. పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆన్లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
కేంద్ర శాఖల్లో 17,727 ఉద్యోగాలు
కేంద్ర విభాగాల్లో 8,326 ఎంటీఎస్, హవల్దార్ ఉద్యోగాలు
గ్రామీణ బ్యాంకుల్లో 9,995 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.