* విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం
![]() |
కూకట్పల్లి, న్యూస్టుడే: ఇంజినీరింగ్లో బీ కేటగిరి (యాజమాన్య కోటా) సీట్లను నిబంధనల ప్రకారం భర్తీ చేసుకోవాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సూచించారు. జేఎన్టీయూహెచ్లో ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులతో శనివారం (జూన్ 29) నిర్వహించిన సమావేశంలో ఇన్ఛార్జి వీసీగా ఆయన మాట్లాడారు. ఈసారి అనుమతుల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే 24 కళాశాలలకు అనుమతి ఇచ్చామని, మరో 36 కళాశాలలకు వెంటనే ఇస్తామని చెప్పారు. 45 కళాశాలలకు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకుల సమస్య ఉందని తెలిపారు. అయినా ఈసారికి షరతులతో అనుమతులు ఇస్తామన్నారు. తొలి విడత కౌన్సెలింగ్లోనే అన్ని కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇస్తామని, కొత్త సీట్లకు మాత్రం సీఎం రేవంత్రెడ్డితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వచ్చే ఏడాది మాత్రం అనుమతుల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తామన్నారు. కోర్ బ్రాంచీలైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ తదితర వాటిలో ప్రవేశాలను పెంచేందుకు అందులో చేరే వారికి ఎక్కువ బోధనా రుసుం ఇవ్వడం, ఫీజు రీయింబర్స్మెంట్ను గ్రీన్ ఛానెల్ ద్వారా త్వరగా మంజూరు లాంటివి చేయాలన్న ఆలోచన ఉందన్నారు. సమావేశంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య కె.విజయకుమార్రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య కె.వెంకటేశ్వరరావు, అకడమిక్ ఆడిట్ విభాగం సంచాలకురాలు తారా కల్యాణి, అటానమస్ కళాశాలల విభాగం సంచాలకుడు రవీందర్రెడ్డితోపాటు తెలంగాణ రూరల్ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల సంఘం ఛైర్మన్ కేఎస్ రవికుమార్ పాల్గొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.