విజయవాడ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్టుడే: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ కోర్సుకు యాజమాన్య, సెల్ఫ్ ఫైనాన్స్ కోటా సీట్ల భర్తీ పూర్తయినట్లు విజయవాడ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు ఆదివారం ప్రకటించారు. మొదటి విడత కౌన్సెలింగ్లో మొత్తం 1893 సీట్లు అందుబాటులో ఉంచగా...1683 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇంకా 210 ఎన్నారై కోటా సీట్లు మాత్రమే మిగిలి ఉన్నట్లు వెల్లడించారు. సీట్ల భర్తీ వివరాలు విశ్వవిద్యాలయం వెబ్సైట్లో ఉంచడంతో పాటు విద్యార్థులకు నియామక పత్రాలు కూడా పంపినట్లు తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా వైద్య కళాశాలల్లో సెప్టెంబరు 20వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల్లోగా చేరాలని సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సమంగా ఇచ్చి.. సమష్టిగా పంచుకొని!
‣ కోస్ట్గార్డ్లో 350 కొలువులు
‣ పీఓ కొలువుల ప్రిపరేషన్ ప్లాన్
‣ లెఫ్టినెంట్ హోదాలో మహిళామణులు
‣ అకడమిక్ యాంగ్జైటీని అధిగమిద్దాం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.