ఈనాడు, అమరావతి: స్వయం ప్రతిపత్తి గల కళాశాలలకు శాశ్వత అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. సాధారణ కళాశాలలకు ఐదు, పదేళ్లు గుర్తింపు ఇవ్వాలని భావిస్తున్నామని వెల్లడించారు. విజయవాడలో స్వయం ప్రతిపత్తి ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘పీజీ కోర్సుల అఫిలియేషన్ ఫీజు తగ్గింపును పరిశీలిస్తాం. అన్ని యూనివర్సిటీలకు ఒకే సర్వీసు ఫీజు ఉండేలా చూస్తాం. ఇంజినీరింగ్లో ఎక్కువగా ఐటీ కోర్సులే కాకుండా మెకానికల్, సివిల్ వంటివీ నిర్వహించాలి. అధ్యాపకులకు నిత్యం శిక్షణ ఇవ్వాలి. బీటెక్లో పెరుగుతున్న ప్రవేశాలకు అనుగుణంగా ప్రమాణాలు పెంచుకోవాలి. ఉన్నత విద్యా మండలి నిర్వహిస్తున్న పుస్తక సమీక్షలో విద్యార్థులు పాల్గొనేలా చూడాలి. రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిన సమయంలో లింక్డ్ ఇన్ ఖాతాలు తెరవడంతో వారిని ఆయా రాష్ట్రాలకు చెందిన వారిగానే పరిగణిస్తున్నారు. దీంతో నైపుణ్యం ఉన్నవారు ఇక్కడ లేనట్లే పరిశ్రమలు పరిగణిస్తున్నాయి. ఏటా 4లక్షల మంది అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే ఇందులో 20శాతం మందికే ఉద్యోగాలు వస్తున్నట్లు నాస్కామ్ వెల్లడిస్తోంది’ అని ఆయన వివరించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నిర్మాణ రంగంలో కొన్ని కోర్సులు!
‣ వచ్చేస్తున్నాయ్... వర్చువల్ ల్యాబ్స్!
‣ టెన్త్ మార్కులతో పోస్టల్ ఉద్యోగం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.