ఈనాడు, హైదరాబాద్: కొత్త విద్యా సంవత్సరంలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి పీజీఈసెట్ జూన్ 10న ప్రారంభమైంది. తొలిరోజు 12,938 మందికి 12,077 మంది (93.34 శాతం) హాజరయ్యారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, కార్యదర్శి శ్రీరాం వెంకటేష్ జేఎన్టీయూహెచ్కు వెళ్లి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. రెక్టార్ ఆచార్య కె.విజయ కుమార్రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య కె.వెంకటేశ్వర్రావు, కన్వీనర్ ఎ.అరుణకుమార్, కో కన్వీనర్ బి.రవీంద్రరెడ్డి ఉన్నారు. పరీక్షలు జూన్ 13వ తేదీ వరకు జరగనున్నాయి.
మరింత సమాచారం ... మీ కోసం!