ఈనాడు, అమరావతి: ఉన్నత విద్యామండలి నిర్వహించిన క్విజ్ ఛాంపియన్షిప్ పోటీల్లో శ్రీ విద్యానికేతన్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన శివజయనాథ్రెడ్డి, చక్రధర్లు ప్రథమ, ట్రిపుల్ఐటీ నూజివీడుకు చెందిన శ్రావణ్ సాయి కుమార్, నీలేష్లు ద్వితీయ, డాక్టర్ సీఎస్ఎన్ ఫార్మసీ కళాశాలకు చెందిన రాములు, ఇమాన్యుల్లు తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. వీరికి వరసగా రూ.లక్ష, రూ.75వేలు, రూ.50వేల నగదు బహుమతితో పాటు సర్టిఫికెట్లను ప్రదానం చేయనున్నారు.
గేట్లో ఆర్జీయూకేటీ విద్యార్థులకు ర్యాంకులు
రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయ విద్యార్థులు గేట్ ర్యాంకులు సాధించినట్లు ఉపకులపతి విజయకుమార్ తెలిపారు. కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో సత్యశేఖర్కు ఎనిమిదో ర్యాంకు, ఏడుగురికి 50లోపు, ముగ్గురికి 10లోపు ర్యాంకులు లభించాయని వెల్లడించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.