ఈనాడు, హైదరాబాద్: ఎలక్ట్రిక్ వైర్లు, కేబుళ్లు ఉత్పత్తి చేసే సంస్థ అయిన ఆర్ఆర్ కేబుల్.. ఎలక్ట్రిషియన్ల పిల్లల కోసం అమలు చేస్తున్న ‘కేబుల్ స్టార్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్’ కింద హైదరాబాద్ నుంచి 85 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఏటా 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను ఈ స్కాలర్షిప్ కింద ఎంపిక చేస్తున్నారు. ఈ సారి దేశవ్యాప్తంగా 1015 మంది విద్యార్ధులను ఎంపిక చేశారు. ఒక్కొక్కరికీ రూ.10,000 చొప్పున స్కాలర్షిప్ అందజేస్తారు. తమ అంచనాలకు మించి హైదరాబాద్ నుంచి స్కాలర్షిప్కు ఎంపికైనట్లు ఆర్ఆర్ కేబుల్ డైరెక్టర్ కీర్తి కాబ్రా తెలిపారు. ఎలక్ట్రిషియన్ల పిల్లలను ఉన్నత విద్యావంతులను చేయాలని, తద్వారా జీవితంలో అత్యున్నత శిఖరాలకు ఎదిగేందుకు తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ స్కాలర్షిప్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.