* ఫొటో, సంతకం అప్లోడింగ్కు జూన్ 6 గడువు
ఈనాడు ప్రతిభ డెస్క్: దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో 9,144 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ(రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు) గత మార్చిలో ఉద్యోగ ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కొందరు అభ్యర్థులు తమ ఫొటోగ్రాఫ్, సంతకం నిర్ణీత విధానంలో పొందుపరచని కారణంగా పొరపాట్లు జరిగాయి. అలాంటి అభ్యర్థులకు మళ్లీ సరిదిద్దుకొనే అవకాశాన్ని ఆర్ఆర్బీ కల్పించింది. ఈ మేరకు అధికారికి ప్రకటన వెలువడింది. సరిగా ఫొటోగ్రాఫ్, సంతకాన్ని జత చేయని అభ్యర్థులకు ఈమెయిల్/ ఎస్ఎంఎస్లను ఆర్ఆర్బీ పంపింది. పొరపాట్లు చేసిన అభ్యర్థులు తాజా పాస్పోర్టు ఫొటో, సంతకాన్ని జూన్ 3వ తేదీ నుంచి జూన్ 6వ తేదీలోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.