• facebook
  • whatsapp
  • telegram

RRC Secunderabad: ఫిబ్రవరి 7 నుంచి గ్రూప్‌-డి ధ్రువపత్రాల పరిశీలన

* 9303 మంది అభ్యర్థులు ఎంపిక

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గ్రూప్‌-డి ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఫిబ్రవరి 7 నుంచి ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ), సికింద్రాబాద్‌ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. లెవెల్‌-1 ఖాళీలకు సంబంధించి ఆగస్టు 17 నుంచి అక్టోబర్‌ 11 వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు(దివ్యాంగులు మినహా) జనవరి 12 నుంచి 22 వరకు శారీరక సామర్థ్య పరీక్షలను ఆర్‌ఆర్‌సీ నిర్వహించింది. శారీరక సామర్థ్య పరీక్షలో ఉత్తీర్ణులైన 9303 మంది అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఇందులో పీడబ్ల్యూడీ విభాగంలో 100 మంది, సీసీఏఏ విభాగంలో 987 మంది, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ విభాగంలో 55,  నాన్‌ పీడబ్ల్యూడీ విభాగంలో 8161 మంది అభ్యర్థులు ఉన్నారు. కేటగిరీ వారీగా కటాఫ్‌ మార్కులు సైతం వెల్లడించింది. పీఈటీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిబ్రవరి 7 నుంచి వైద్య పరీక్షలతో పాటు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల తేదీలు, నిర్వహణ ప్రాంతం వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆర్‌ఆర్‌సీ స్పష్టం చేసింది. ఎంపికైన అభ్యర్థులకు వ్యక్తిగతంగా ఎస్‌ఎంఎస్‌/ మెయిల్‌ ద్వారా కాల్‌లెటర్ డౌన్‌లోడ్‌ సమాచారం పంపనున్నారు. 

ప్రకటన వివరాలు 


********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ సరైన రివిజన్‌ సక్సెస్‌ సూత్రం!

‣ ఇంజినీర్లకు ఆర్మీ ఉద్యోగాలు

‣ ఎన్‌సీసీ క్యాడెట్లకు ఆర్మీ ఆహ్వానం

‣ మెయిన్స్‌లో విజయానికి మెలకువలు! (ఆంధ్రప్రదేశ్‌)

‣ గెయిల్‌లో కొలువులు

‣ మెయిన్స్‌లో విజయానికి మెలకువలు! (తెలంగాణ)

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.