* మంజూరు చేసిన కేంద్ర రక్షణ శాఖ
![]() |
ఈనాడు, దిల్లీ: కేంద్ర రక్షణ శాఖ దేశవ్యాప్తంగా కొత్తగా 23 సైనిక్ స్కూళ్లను మంజూరు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె జడ్పీ హైస్కూల్కు చోటు దక్కింది. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దశలవారీగా 100 సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని కేంద్రం విధాన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సైనిక్ స్కూల్స్ సొసైటీ దేశవ్యాప్తంగా 19 పాఠశాలలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో నెల్లూరులోని అదానీ వరల్డ్ స్కూల్ ఉంది. ఇప్పుడు కొత్తగా మరో 23 స్కూళ్లను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్ ఆమోదముద్ర వేసినట్లు రక్షణశాఖ శనివారం(సెప్టెంబర్ 16) ఒక ప్రకటనలో తెలిపింది. వీటిలో ఛత్తీస్గఢ్కు 4, రాజస్థాన్కు 4, మధ్యప్రదేశ్కు 3, ఉత్తరప్రదేశ్కు 3, కేరళకు 2, హరియాణా, హిమాచల్ప్రదేశ్, కర్ణాటకలకు ఒక్కోటి చొప్పున దక్కాయి. తెలంగాణకు ఒక్కటీ రాలేదు. ఇంతకుముందు పూర్తి ప్రభుత్వ విధానంలో ఏర్పాటైన 33 సైనిక్ స్కూళ్లలో ఆంధ్రప్రదేశ్నుంచి కోరుకొండ, కలికిరి స్కూళ్లు ఉన్నాయి. దీంతో రాష్ట్రానికి మొత్తం 4 స్కూళ్లు దక్కినట్లయింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.