* పేపర్-1కి 86.03, పేపర్-2కి 82.58 శాతం మంది పరీక్షకు హాజరు
ప్రతిభ డెస్క్: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) ఫలితాలు బుధవారం (జూన్ 12న) విడుదల కానున్నాయి. మే 20న ప్రారంభమైన పరీక్షలు జూన్ 2తో ముగియగా మరుసటి రోజే ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్స్ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. పేపర్ల వారీగా కీని అందుబాటులో ఉంచిన అధికారులు వీటిపై అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించారు. టెట్ పేపర్-1కు 99,958 మంది, పేపర్-2కు 1,86,423 మంది దరఖాస్తులు చేసుకోగా పేపర్-1కి 86.03 శాతం మంది, పేపర్-2కి 82.58 శాతం మంది హాజరయ్యారు.