ఎస్కేయూలో వెనుదిరిగిన విద్యార్థులు
ఎస్కేయూ, న్యూస్టుడే: పరీక్ష రాసేందుకు విద్యార్థులు కేంద్రంలోకి ప్రవేశించే ముందు ప్రశ్నపత్రం రాలేదంటూ అధికారులు చెప్పడంతో వారంతా గందరగోళానికి గురయ్యారు. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో నవంబరు 30న ఇది జరిగింది. ఎస్కేయూ పరిధిలో పీజీ రెండో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. వీటితో పాటు నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం మోరల్ వాల్యూస్, ఎథిక్స్ సబ్జెక్టును అనుబంధంగా ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి పరీక్ష నవంబరు 30న నిర్వహించాల్సి ఉంది. కొన్ని విభాగాల్లో ఈ పరీక్ష వాయిదా వేశారు. పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో వాయిదా వేయలేదు. దీంతో 29 మంది పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ప్రశ్నపత్రాలు రాలేదని తాత్కాలిక బోధనా సిబ్బంది చెప్పడంతో విద్యార్థులు వెళ్లిపోయారు. విశ్వవిద్యాలయంలోనే ప్రత్యేకంగా పరీక్షల విభాగం ఉంది. ఎస్కేయూకు అనుబంధంగా ఉన్న కళాశాలల్లోనూ పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత ఆ విభాగానిదే. అలాంటిది వర్సిటీలోనే ప్రశ్నపత్రాలు సరఫరా చేయకపోవడం దారుణం. ప్రశ్నపత్రాలు రాలేదన్న విషయంపై ఎస్కేయూ అధికారులు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.