హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారైంది. అక్టోబరు 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర తొలి గ్రూప్-1 ప్రకటనకు భారీ డిమాండ్ కనిపించింది. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ పోస్టులు సాధిస్తే భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ అయ్యే అవకాశం ఉండటంతో నిరుద్యోగులు, ఉద్యోగార్థులు పెద్దఎత్తున పోటీపడి రికార్డు స్థాయిలో దరఖాస్తు చేశారు. గడువు ముగిసే నాటికి (జూన్ 4) మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కోపోస్టుకు సగటున 756 మంది చొప్పున పోటీపడుతున్నారు. జనవరి లేదా ఫిబ్రవరిలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహించే అవకాశముందని టీఎస్ పీఎస్సీ తెలిపింది.
225 పోస్టులు మహిళలకే..
గ్రూప్-1 ప్రకటనలో మొత్తం 503 పోస్టుల్లో మహిళలకు 225 రిజర్వు అయ్యాయి. వీటికి 1,51,192 మంది దరఖాస్తు చేయగా, ఒక్కో పోస్టుకు సగటున 672 మంది పోటీపడుతున్నారు. జనరల్ పోస్టుల్లోనూ మెరిట్ సాధిస్తే మరిన్ని పోస్టులు పొందేందుకు అవకాశముంది. దివ్యాంగుల కేటగిరీలో గల 24 పోస్టులకు 6,105 మంది దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు 254 మంది చొప్పున పోటీలో ఉన్నారు. 51,553(15.33శాతం)మంది ప్రభుత్వ ఉద్యోగులూ దరఖాస్తు చేశారు.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ పీజీలో ప్రవేశాలకు సీపీగెట్-2022
‣ ఆలోచనల పరిధి పెంచే ఐఐటీ కోర్సు!
‣ ఫిజియోథెరపీలో ప్రామాణిక శిక్షణ
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.